తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం పరిధిలోని గొట్టికాడు ఎస్టీ కాలనీలో గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి అనూశ్రీ, అంగన్వాడి టీచర్ సుమతి ఆధ్వర్యంలో కిశోర వికాసం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనూశ్రీ మాట్లాడుతూ 11నుంచి 18 ఏళ్ల బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, వారు ఎదగడంలో అడ్డంకులను తొలగించేందుకు సమాజం పటిష్ట భాగస్వామ్యం వహించాలని సూచించారు.