అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అత్యంత బాధాకరమని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు ఈ విపత్కర పరిస్థితిని తట్టుకోగల బలాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఓ ప్రకటనలో స్పందించారు