గన్‌తో కాల్చుకుని సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

76చూసినవారు
గన్‌తో కాల్చుకుని సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్‌ టాయిలెట్‌లోకి వెళ్లి సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని మరణించాడు. గుజరాత్‌లోని సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది. జైపూర్‌కు చెందిన 32 ఏళ్ల కిషన్ సింగ్‌ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని టాయిలెట్‌కు వెళ్లి సర్వీస్‌ రైఫిల్‌తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్