AP: రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. తలలు పగిలేలా కొట్టుకున్న ఘటన చిత్తూరు జిల్లా కే.వి.పల్లి మండలంలో చోటుచేసుకుంది. తిమ్మాపురంలోని ఓ రెండు కుటుంబాలు ఇసుక విషయంలో గొడవ పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారులతో సహా 10 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో రవి, తేజస్, శ్రావణి, భారతి తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడించారు. గాయపడిన వారికి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.