సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన TTDని అభినందిస్తున్నానని AP CM చంద్రబాబు వెల్లడించారు. స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో TTD సఫలీకృతమైందని అన్నారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు సౌకర్యాలు కల్పించి.. దర్శన భాగ్యం అందించేందుకు TTD చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను అని CM తెలిపారు.