నేడు కర్నూల్లో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు శనివారం కర్నూల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సి. క్యాంపు రైతు బజారులో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు. అలాగే బైరాల్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీ నాయకులతో సమావేశమై మాట్లాడి.. హైదరాబాద్ బయలుదేరనున్నారు.