ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11న మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలు, ఈ ఏడాది మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు.