ఏపీ సీఎం చంద్రబాబు గతం కంటే కాస్త భిన్నంగా పరిపాలిస్తున్నారు. ఇప్పటికే కీలక మార్పులను తీసుకువచ్చిన ఆయన మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ శ్రేణుల కోసం ఎన్టీఆర్ భవన్లో నిత్యం మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు వారికి విధులు కేటాయిస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా మరోమారు మంత్రులకు షిఫ్ట్లు వేసి ప్రజల సమస్యలను పరిష్కారించాలని సీఎం సూచించారు.