ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్- 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే కుప్పంను 100 శాతం సోలార్ పవర్గా మార్చే ప్రణాళికపై మాట్లాడనున్నారు. 8న కుప్పం పర్యటన అనంతరం ప్రధానిని కలవనున్నట్లు సమాచారం.