అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం
జగన్ పర్యటిస్తున్నారు. చింతపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులతో ఆయన ముచ్చిటిస్తున్నారు. మరి కాసేపట్లో వారికి ట్యాబ్లు అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయనుంది.