AP: గుడ్ ఫ్రైడే ముందు రోజు పాస్టర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్ల గౌరవవేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 8,427 మంది పాస్టర్లకు 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేసింది.