AP: రాష్ట్రంలో మొదటి ఏడాది ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దశాబ్దకాలంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల విద్యార్థులు అద్భుతాలు చేశారన్నారు.