వైఎస్ జగన్‌పై దాడికి కుట్ర: వైసీపీ

61చూసినవారు
వైఎస్ జగన్‌పై దాడికి కుట్ర: వైసీపీ
తిరుపతిలో వైఎస్ జగన్‌పై దాడికి ఎన్డీఏ కూటమి కుట్ర పన్నుతోందని వైసీపీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఆరోపించింది. ‘బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి గుండాలను పురమాయించినట్లు సమాచారం. జగన్‌పై దాడి చేసేందుకు పెద్ద సంఖ్యలో మనుషుల్ని తీసుకొచ్చారని తెలుస్తోంది. కోడి గుడ్లతో దాడి చేస్తారని సమాచారం. చంద్రబాబు బండారం ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నట్లు ఉంది.’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్