గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర సంఘటన జరిగింది. కన్న కొడుకును ఓ తండ్రి విషమిచ్చి చంపాడు. బాపూనగర్ ప్రాంతంలో నివసించే 47 ఏళ్ల కల్పేష్ గోహెల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన పదేళ్ల కుమారుడు ఓంకు విషం కలిపిన నీటిని ఇచ్చి తాగించాడు. దీంతో బాలుడి శరీరం రంగు మారడంతోపాటు అతడి ఆరోగ్యం క్షీణించింది. ఇది చూసి భయాందోళన చెందిన కల్పేష్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, బాలుడిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు.