ముంబైలోని కుర్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. తన తల్లి సొంత అక్కను ఎక్కువగా ఇష్టపడుతుందని చెల్లి రేష్మ భావించింది. వారిద్దరికీ చాలా కాలంగా మనస్పర్థలు ఉండేవి. ఈ కారణంగా తల్లి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో రేష్మ వంటగదిలోంచి కత్తి తీసి తల్లిని పొడిచి చంపేసింది. తల్లిని హత్య చేసిన వెంటనే.. చునాభట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మను అదుపులోకి తీసుకున్నారు.