ఢిల్లీలో సంపూర్ణ మెజార్టీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై 10 రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని తమ నిర్ణయాన్ని హైకమాండ్కు పంపుతామని, పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.