ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది.