ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేయబోతున్నారు. ప్రజలు తమ ఆకాంక్షలను తీర్చే మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అందరూ బయటకు వచ్చి తమ ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.