ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.