సీఎం జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని చంద్రబాబు దుయ్యబట్టారు. "పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్దా? ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువస్తున్నారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి." అని రాయచోటి సభలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.