ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి జారీ చేసే లైసెన్స్ల ప్రక్రియలో డిజిటల్ ఆన్లైన్ లైసెన్స్ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది. గతంలో OLMS ఆన్లైన్ లైసెన్సు విధానం ఉండగా, 2019 నుంచి ఈ-ఆఫీస్ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ రెండు విధానాల్లో లోటుపాట్లను సవరించి, డిజిటల్ ఆన్లైన్ నిర్వహణ వ్యవస్థను తెస్తున్నారు.