AP: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఇవాళ ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ తీగలు మార్చే క్రమంలో గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, తీగలపై వేలాడుతున్న అతడిని కిందకు దించారు. హుటాహుటిన శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించారు.