తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఏపీలోని కొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.