చాక్లెట్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ మైగ్రేన్కు కారణం అవుతుంది. ఇది రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. దీంతో తలనొప్పి పెరుగుతుంది. చాక్లెట్ తిన్న తర్వాత మెదడు యొక్క నరాలలో అస్థిర కదలికల వల్ల నొప్పి పెరుగుతుంది.