చాలామందికి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే ఇలా ఉదయాన్నే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కాఫీ, టీ కి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు.