AP: అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలంలో విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మెలితిప్పి కొట్టాడని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.