AP: మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యేలోపు డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని పర్యవేక్షించాలని తెలిపారు.