ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు అలజడి రేపాయి. ఇచ్ఛాపురం పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఒకసారి, 4.03 గంటలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.