పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైకిలింగ్ చేసి విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం రాష్ట్ర మంత్రి కాకినాడ పట్టణం పరిధిలోని పోర్ట్ ఏరియా లో బియ్యం గోదాములు, ఆగ్రో ఇండస్ట్రీ లను తనిఖీ చేశారు.