ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

69చూసినవారు
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద వరద తాకిడి పెరిగింది. గురువారం రాత్రి 10 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11. 75 అడుగులకు చేరింది. కాలువలకు 1800 క్యూసెక్కులతో పాటు 9, 68, 015 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. కాగా అధికారులు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్