అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి.రావు 73వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పి.వి. రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మే 12న కాకినాడలో జరగబోయే మాలల మహారణభేరి కరపత్రాన్ని ఆవిష్కరించారు.