అమలాపురం: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి

52చూసినవారు
అమలాపురం: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి
అమలాపురం రూరల్ పరిధిలోని కామనగరువు బైపాస్ రహదారికి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైందని పోలీసులు తెలియజేశారు. మృతుడికి 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. రెండు రోజుల క్రితమే మరణించినట్లు గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని, ప్రమాదవశాత్తూ మరణించారా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్