అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ వైష్ణవి కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయంలో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు తేజ వెంకటేశ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, భారత త్రివిధ దళాలు శ్రేయస్సు కోసం గోత్ర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే భారతదేశ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్ధించారు.