తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కోనసీమలోని సీహెచ్ఓలు అమలాపురం పట్టణ కేంద్రం కలెక్టరేట్ ఎదురుగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యంతో పోరాటం చేసి వీర మరణం పొందిన సత్యసాయి జిల్లా చెందిన మురళీ నాయక్ కు శనివారం సెల్యూట్ చేసి నివాళులర్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జిల్లా అధ్యక్షురాలు మమత జ్యోతి మాట్లాడుతూ సైనికుడు మురళీ ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు.