తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కోనసీమ కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ ఎదురుగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న నిరసన కార్యక్రమం శుక్రవారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీహెచ్ఓల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు మమత జ్యోతి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న తమ జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు.