అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో జిల్లా రెవెన్యూ అధికారిణి రాజకుమారి దివ్యాంగులకు కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.