ఈ నెల 14వ తేదీన నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.