నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా స్టాక్ యార్డ్ లకు ఇసుకను తరలించాలని కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వర్షాకాల రుతుపవన సమయంలో భవన నిర్మాణానికి అవసరమైన ఇసుక నిల్వలను స్టాక్ యార్డ్ లలో ఉంచాలని సూచించారు.