రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆనందరావు తెలియజేసారు. అమలాపురం నియోజకవర్గం పరిధిలోని రైతులకు ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన పవర్ టిల్లర్ లను ఆయన బుధవారం పంపిణీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలాపురం నియోజకవర్గానికి 12 పవర్ టిల్లర్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే చెప్పారు.