అమలాపురం: ఓఎన్జీసీ యాజమాన్యంతో చర్చిస్తాం: ఎంపీ జి.ఎం. హరీష్

82చూసినవారు
అమలాపురం: ఓఎన్జీసీ యాజమాన్యంతో చర్చిస్తాం: ఎంపీ జి.ఎం. హరీష్
అల్లవరం మండలం, ఓడలరేవు గ్రామస్థులు ఓఎన్జీసీ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని దీక్షలను చేపట్టారు. అంతేకాకుండా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని శనివారం అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ సందర్శించారు. ఈ క్రమంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓఎన్జీసీ యాజమాన్యంతో చర్చించి గ్రామస్థుల డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్