స్వర్ణాంధ్ర 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేలా యువత, మహిళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం అమలాపురంలో కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి 15వ సమావేశం జరిగింది.