ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో నున్న ఉమా కమండలేహేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ తదితర కార్యక్రమాలను ఘనంగా జరిపారు. అనంతరం రాత్రి స్వామివారి దివ్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.