ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు శుక్రవారం పరిశీలించారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు కూసుంపూడి రామకృష్ణ రాజు, ముదునూరి వెంకటరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు, మండల పార్టీ నాయకులు ఉన్నారు.