ఆత్రేయపురం మండలం వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ వర్షంలోనూ అష్టోత్తర శతనామావళి పూజ నిమిత్తం భక్తులు భారీగా తరలివచ్చారు. వర్షంలో తడుస్తూ స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.