కోనసీమ జిల్లా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా అమలాపురానికి చెందిన అమలదాసు కృష్ణవేణిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పార్టీని బలోపేతం చేస్తానని, మహిళల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని కృష్ణవేణి తెలిపారు. పార్టీ తరఫున బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు.