ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి బలమైన గాయాలు

53చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి బలమైన గాయాలు
అమలాపురం రూరల్ మండలం బండారులంకలోని ఆర్ ఆర్ నగర్ చెక్‌పోస్ట్ వద్ద అమలాపురం నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం మోటార్ బైక్ ను ఢికొట్టింది. అరటి గెలల లోడుతో వెళ్తున్న బైకును బస్సు ఢీకొనడంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి అమలాపురం పట్టణ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్