ఆలమూరు మండలం పెదపళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం ఓఎన్జిసి నిధులతో నిర్మించిన ఓపిషెడ్ ను శుక్రవారం ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఈ నిర్మాణంతోపాటు పెదపళ్ళ గ్రామపంచాయతీకి శానిటేషన్ ట్రాక్టర్ ను ఓఎన్జిసి అధికారులు మంజూరు చేయగా దాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఓఎన్జిసి అధికారి శాంతానుదాస్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.