ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారుజామున ప్రారంభమై రాత్రి వరకు కొనసాగింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. జిల్లాలో మొత్తం 2, 42, 200 మంది లబ్ధిదారులకు గానూ రాత్రి 7 గంటల వరకు 2, 35, 700 మందికి పెన్షన్ అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వారికి రేపు పంపిణీ చేయనున్నారు.