రావులపాలెం మండలం ర్యాలీ గ్రామంలో స్థానిక యువత ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తనయుడు బండారు సంజీవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ ఆటలతో శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వేసవి సెలవల్లో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రేణులు పాల్గొన్నారు.