సరస్వతీ పుష్కరాలకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

64చూసినవారు
సరస్వతీ పుష్కరాలకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో అంతర్ వాహినిగా సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు జరగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం నుంచి సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ బస్సులను నడపనునున్నారు.

సంబంధిత పోస్ట్